puri: పూరీతో ఆ స్టార్ హీరోలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుందా?


పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని తన తనయుడు ఆకాశ్ తో చేయనున్నట్టు చెప్పాడు. ఆ తరువాత సినిమా బాలకృష్ణతోనే ఉంటుందని అన్నాడు. ఈ విషయాన్ని బాలకృష్ణ కూడా స్పష్టం చేశాడు. ఇక వీళ్లు కాకుండా పూరీ జాబితాలో చాలామందే స్టార్ హీరోలు కనిపిస్తున్నారు. మహేశ్ తో 'జన గణ మన' చేయనున్నట్టు పూరీ ప్రకటించాడు కానీ .. మహేశ్ మాత్రం స్పందించనే లేదు. ఈ సినిమా మహేశ్ చేయడం డౌటే అనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇక రవితేజ కోసం .. వెంకటేశ్ కోసం కథలు సిద్ధంగా వున్నట్టుగా పూరీ చెప్పాడు. పూరీతో వున్న ఫ్రెండ్షిప్ కారణంగా రవితేజ ఓకే చెప్పే ఛాన్స్ వుంది .. ఎటొచ్చీ ఓ పట్టాన వెంకటేశ్ ను ఒప్పించడమే కష్టం. ఈ నేపథ్యంలోనే చిరూకి కథ చెప్పాననీ .. ఆయనకి నచ్చేసిందని  పూరీ అన్నాడు. ఆయనతో తప్పకుండా ఓ సినిమా చేస్తానని చెప్పాడు. అయితే చిరూకి గల కమిట్మెంట్స్ కారణంగా ఇప్పట్లో అది కుదరకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో రవితేజతో మినహా మిగతా వాళ్లతో పూరీ సెట్స్ పైకి వెళ్లడం ఇప్పట్లో జరగకపోవచ్చని చెప్పుకుంటున్నారు.      

  • Loading...

More Telugu News