rajamouli: 'స్పైడర్' ఆడియో వేడుకకి ముఖ్య అతిథులుగా రాజమౌళి .. శంకర్!


'స్పైడర్' సినిమా కోసం ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు .. అటు కోలీవుడ్ ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక భారీ ఈవెంట్ ను చెన్నైలో జరపడానికి ప్లాన్ చేశారు. ఈ వేదికపైనే మహేశ్ బాబును అక్కడి ప్రేక్షకులకు నేరుగా పరిచయం చేయనున్నారు. ఆ తరువాత తమిళ .. తెలుగు వెర్షన్స్ కి సంబంధించిన ఆడియోను రిలీజ్ చేస్తారు.

 అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ నుంచి రాజమౌళిని .. కోలీవుడ్ నుంచి శంకర్ ను ఆహ్వానించారట. మహేశ్ బాబు కోసం రాజమౌళి .. లైకా ప్రొడక్షన్స్ వారితో గల అనుబంధం కారణంగా శంకర్ ఈ ఫంక్షన్ కి వెళ్లడానికి అంగీకరించినట్టు సమాచారం. ఆ తరువాత హైదరాబాద్ లోను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో దర్శకనిర్మాతలు వున్నట్టుగా తెలుస్తోంది.      

  • Loading...

More Telugu News