mahesh babu: లక్నో షెడ్యూల్ పూర్తి .. రొమేనియాకి మహేశ్ బాబు


కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు .. 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీమ్ లక్నో వెళ్లింది. అక్కడ మంగళవారం వరకూ షూటింగ్ జరగవలసి వుంది. అయితే నిన్ననే అక్కడి షూటింగును పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు. ఈ షెడ్యూల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పారు.

వచ్చేవారమే 'స్పైడర్' టీమ్ తో కలిసి పాట చిత్రీకరణ కోసం మహేశ్ బాబు 'రొమేనియా' వెళుతున్నాడు. ఫారిన్ షూట్ కి వెళ్లడానికి ముందు ఆయనకి ఓ రెండు రోజుల పాటు రెస్ట్ అవసరమని భావించే, 'భరత్ అను నేను' షూటింగును అనుకున్న దానికంటే 3 రోజుల ముందుగా పూర్తి చేశారని అంటున్నారు. 'భరత్ అను నేను' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News