chiranjeevi: 'బాహుబలి' స్థాయిలో 'ఉయ్యాలవాడ'కు విజువల్ ఎఫెక్ట్స్!


చిరంజీవి 151వ చిత్రంగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమాను రీసెంట్ గా లాంచ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశం ఉండటంతో నిర్మాణ విలువలను పెంచుకుంటూ వెళుతున్నారు. భారీ సెట్టింగ్స్ కి .. విజువల్ ఎఫెక్ట్స్ కి .. కాస్ట్యూమ్స్ కి అధిక ప్రాధాన్యతనిస్తున్నారట. హాలీవుడ్ సినిమాలకి పనిచేసిన సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.

 విజువల్ ఎఫెక్ట్స్ లో 'బాహుబలి' బెంచ్  మార్క్ గా నిలిచింది. ఆ స్థాయికి ఎంత మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అదే విధంగా వివిధ భాషలకి చెందిన అగ్రస్థాయి నటీనటులను ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమాకి 200 కోట్లు ఖర్చు కావొచ్చని ఒక అంచనాకి వచ్చారని సమాచారం. ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు కావడం వలన .. ఆయన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోవాలనే ఉద్దేశం కారణంగా .. ఈ సినిమాను 'బాహుబలి' స్థాయిలో ప్రేక్షకుల ముందుంచాలనే దిశగా పనులు జరుగుతున్నాయి.   

  • Loading...

More Telugu News