bellamkonda: 'జయ జానకి నాయక' దూకుడు .. 100 థియేటర్స్ పెంచేశారు!


'నేనే రాజు నేనే మంత్రి' .. 'లై' సినిమాలతో పాటు ఆగస్టు 11వ తేదీన 'జయ జానకి నాయక' సినిమా విడుదలైంది. బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ .. రకుల్ జంటగా నటించిన ఈ సినిమా, మొదటి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకలేదు. పైగా 'నేనే రాజు నేనే మంత్రి' .. 'లై' సినిమాలు గట్టిపోటీనిచ్చాయి.

ఈ వారం రోజుల్లోనే 'జయ జానకి నాయక' తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. తొలివారం తరువాత మిగతా రెండు సినిమాల ప్రభావం కాస్త తగ్గడం .. 'జయ జానకి నాయక'కి ఫ్యామిలీ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ కావడం కలిసొచ్చింది. దాంతో ఈ సినిమాకి ఆయా ప్రాంతాల్లో మొత్తంగా కలుపుకుని 100 థియేటర్లను పెంచేశారు. ఈ కారణంగా ఈ సినిమా వసూళ్లు భారీస్థాయిలో పెరుగుతాయని భావిస్తున్నారు.  

  • Loading...

More Telugu News