sai dharam tej: తన కోసమే తేజు పారితోషికం తీసుకోలేదు :కృష్ణవంశీ


కొంత గ్యాప్ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన 'నక్షత్రం' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ, ఇందులో సాయిధరమ్ తేజ్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రను ముందుగా సంజయ్ దత్ తో చేయించాలనుకున్నానని అన్నారు. తనతో గల సాన్నిహిత్యం కారణంగా తప్పకుండా చేసేవారేనని చెప్పారు.

 అయితే ఆ పాత్రను చాకులాంటి కుర్రాడితో చేయిస్తే మరింత బాగా వస్తుందని భావించి, తేజును తీసుకున్నానని అన్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర 30 నిమిషాలపైన ఉంటుందనీ, తాను అనుకున్న దానికంటే బాగా చేశాడని చెప్పారు. తన దర్శకత్వంలో చేయాలనే ఇంట్రస్ట్ కారణంగా ఆయన పారితోషికంగా ఒక్క పైసా కూడా తీసుకోలేదని అన్నారు. తేజు కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News