balakrishna: బాలయ్య స్పీడ్ మాములుగా లేదు .. ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోవడం లేదు!


పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తోన్న 'పైసా వసూల్' సినిమా, నిన్ననే షూటింగ్ పార్టు ను పూర్తిచేసుకుంది. తనకంటే బాలకృష్ణ గారు స్పీడుగా ఉండటం వల్లనే ఈ సినిమా షూటింగును అనుకున్న దానికంటే ముందుగానే ముగించామని పూరీ జగన్నాథ్ అన్నాడు. చెప్పినదానికంటే మూడు వారాల ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తుండటానికి కారణం కూడా బాలకృష్ణ గారేనని చెప్పాడు.

 ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బాలకృష్ణ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. ఈ రోజు నుంచి కె.ఎస్.రవికుమార్ తో కలిసి ఆయన సెట్స్ పైకి వెళుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమా, ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. తొలి షెడ్యూల్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు.

  • Loading...

More Telugu News