Rakul: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం


*  తనకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినందువల్లే 'జయ జానకి నాయక' చిత్రాన్ని చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. "ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి రెండే కారణాలు. ఒకటి, కథలో నా పాత్ర పెద్దది, బాగా నచ్చింది. ఇక రెండో కారణం, బోయపాటి దర్శకుడు కావడం.. అంతే" అని చెప్పింది రకుల్.
*  పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జయతి కథానాయికగా నటిస్తున్న చిత్రం 'లచ్చి'. ఈశ్వర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని జయతి సొంతంగా నిర్మిస్తోంది.  
*  కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'నక్షత్రం' చిత్రం రేపు (ఆగస్టు 4) విడుదలవుతోంది. కాగా, ఈ చిత్రం నిడివి 2 గంటల 45 నిమిషాలు వుందట. వాస్తవానికి ఇది మూడు గంటలుందని, ప్రేక్షకులకు బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో ఓ పావు గంట నిడివి తగ్గించారని తెలుస్తోంది.  
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన 'జయ జానకి నాయక' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 11న రిలీజ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News