kamal: 100 కోట్ల క్లబ్ లో చేరానంటోన్న కమలహాసన్!


కథానాయకుడిగా .. దర్శక నిర్మాతగా .. రచయితగా ఇలా అనేక విషయాల్లో తన సత్తా చాటుకున్న కమలహాసన్, బుల్లితెర ప్రేక్షకుల కోసం 'బిగ్ బాస్' చేస్తున్నారు. ఇటీవల ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ సెలబ్రిటీ .. మురికివాడల్లో నివసించే వారి గురించి తప్పుగా మాట్లాడటం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై స్పందించిన 'పుతియ తమిళగం' అధ్యక్షుడు కె. కృష్ణస్వామి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న కమల్ పై 100 కోట్లకి పరువు నష్టం దావా వేశారు.

ఈ విషయంపై కమల్ ప్రతిస్పందిస్తూ .. తాను కూడా 100 కోట్ల క్లబ్ లో చేరానంటూ చమత్కరించారు. ఏ భారతీయ నటుడు ఈ క్లబ్ లో చేరడానికి సాహసం చేయడనీ .. తనకి మాత్రమే ఆ అవకాశం దక్కిందని ఆయన అన్నారు. ఇప్పుడు తనపై పరువు నష్టం దావా వేసిన వ్యక్తి .. గతంలో 'సందియర్' టైటిల్ విషయంలోను కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, తాను డబ్బు కట్టడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News