Shriya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం


*  అందాలతార శ్రియా పోర్చుగల్ ప్రేమలో పడిపోయింది. గతంలో తాను యూరప్ లో పలు దేశాలు సందర్శించినప్పటికీ, పోర్చుగల్ వెళ్లడం మాత్రం ఇదే ప్రథమమని, పైసా వసూల్ సినిమా కోసం అక్కడికి వెళ్లానని చెప్పింది. ఆ దేశం అందాలు చూసి ఫిదా అయిపోయానని, అక్కడి బీచ్ లు, పోర్టులు చూస్తే మన గోవాను తలపించిందని శ్రియా చెప్పుకొచ్చింది.
*  ప్రస్తుతం 'ఎమ్మెల్యే' చిత్రంలో నటిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ నటించే కొత్త చిత్రం షూటింగ్ మొదలైంది. జయేంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో ప్రారంభం అయింది. ఇందులో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది.
*  నారా రోహిత్ కోసం యంగ్ హీరో నాగ శౌర్య ఓ గెస్ట్ పాత్ర పోషించాడు. నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న 'కథలో రాజకుమారి' చిత్రంలో ఈ గెస్ట్ రోల్ చేశాడు. ఇందుకోసం మూడు రోజుల షూటింగులో పాల్గొన్నాడు. పైగా, పారితోషికం కూడా ఏమీ తీసుకోలేదట.
* నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'లై' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఆగస్టు మొదటి వారంలో ట్రైలర్ ను, అదే నెల 11న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.  

  • Loading...

More Telugu News