Nayan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం


*  అందాలతార నయనతార తాజాగా రెండు రోజుల షూటింగుకి 5 కోట్లు తీసుకుందట. ఓ వాణిజ్య ప్రకటనలో నటించడానికి అమ్మడు ఈ మొత్తాన్ని చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. నయనతార క్రేజ్ ఇంకా తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం.    
*  బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా వసూల్' చిత్రం ఆడియో వేడుకకు డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 13న ఈ వేడుకను హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించారు. ఇందులో శ్రియా కథానాయికగా నటిస్తోంది.
*  ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ దర్శకత్వంలో హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది. మలయాళంలో వచ్చిన 'టూ కంట్రీస్' చిత్రం ఆధారంగా దీనిని శంకర్ నిర్మిస్తున్నారు.  
*  గతంలో వచ్చిన 'పందెం కోడి' చిత్రానికి సీక్వెల్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. ఇందులో వరలక్ష్మి కథానాయికగా నటిస్తుందట.  

  • Loading...

More Telugu News