vishal: విశాల్ కి .. కార్తీకి ప్రభుదేవాతో పడటం లేదట!


నడిగర్ సంఘం సొంత భవన నిర్మాణం కోసం .. తామిద్దరం పారితోషికం లేకుండా ఒక సినిమా చేయనున్నట్టు కొంతకాలం క్రితం విశాల్ .. కార్తీ చెప్పారు. ఈ సినిమాపై వచ్చిన మొత్తం భవన నిర్మాణానికే కేటాయిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుదేవా దర్శకత్వంలో ఈ ఇద్దరు హీరోలు ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాకి 'కరుప్పు రాజా వెల్ల రాజా' (నల్ల రాజా తెల్ల రాజా) అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందేమోనని అనుకుంటూ ఉండగా, విశాల్ .. కార్తీ ఇద్దరూ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ప్రభుదేవాతో సరిపడకపోవడమే వాళ్లు ఈ సినిమా చేయకపోవడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటూ .. ఆ దిశగా అభిమానుల్లో అంచనాలు పెంచే పనిలో వున్నారు.

  • Loading...

More Telugu News