charan: చిరూ మూవీ ఆధారంగా తెరకెక్కనున్న చరణ్ సినిమా?


ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. సమంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నాడు.

 ' నేను లోకల్' హిట్ తో దర్శకుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన వినిపించిన కథ నచ్చడంతో .. తదుపరి ప్రాజెక్టుగా ఈ సినిమా చేయడానికి చరణ్ ఉత్సాహాన్ని చూపుతున్నాడట. గతంలో చిరంజీవి చేసిన 'మంత్రి గారి వియ్యంకుడు' సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందనేది తాజా సమాచారం. అయితే ఇది రీమేక్ కాదట .. ఆ సినిమాలోని కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకుని ఈనాటి ట్రెండ్ కి అనుగుణంగా మార్చనున్నారని అంటున్నారు. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.    

  • Loading...

More Telugu News