akhil: అప్పటి రూమర్ పై ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన అఖిల్!


అఖిల్ తొలి సినిమా సెట్స్ పైకి వచ్చిన సమయంలో .. ఆ సినిమాలో కథానాయికగా మెగా డాటర్ నిహారిక ఎంపిక అయిందనే వార్త షికారు చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అలా జరగడానికి ఒక కారణం ఉందని తాజాగా అఖిల్ చెప్పాడు.

ఈ సినిమాకి ముందు తామిద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించామని అన్నాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కి రాజమౌళి తనయుడు కార్తికేయ దర్శకత్వం వహించాడని చెప్పాడు. సినిమా స్థాయిలో ఆ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించాడనీ .. ఆ షూటింగ్ చూసిన చాలామంది అది తన తొలి సినిమాకి సంబంధించిందని అనుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. ఆ షార్ట్ ఫిల్మ్ అవుట్ పుట్ సరిగ్గా రాకపోవడం వలన, అది రిలీజ్ కాలేదంటూ చెప్పుకొచ్చాడు.  

  • Loading...

More Telugu News