annadmk: శశికళకు సీఎం పదవి కోసం ఎమ్మెల్యేల సంతకాలు... త్వరలోనే గవర్నర్ కు సమర్పణ


త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా శశికళ న‌ట‌రాజ‌న్‌తో ప్రమాణ స్వీకారం చేయించేందుకు అన్నాడీఎంకేలో ఆమెకు మ‌ద్దతుగా నిలుస్తోన్న‌ ఎమ్మెల్యేలు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఆమెకు మ‌ద్ద‌తుగా సంత‌కాల సేక‌ర‌ణ చేప‌ట్టారు. ఆ లేఖపై ఆమెకు మ‌ద్దతు ప‌లుకుతున్న‌ ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేశారు. త్వరలోనే ఈ లేఖను గవర్నర్ విద్యాసాగ‌ర్‌రావుకి అంద‌జేసి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై నమ్మకం పోయిందని ప్ర‌క‌టించ‌నున్నారు. మ‌రోవైపు ప‌న్నీర్ సెల్వంకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

  • Loading...

More Telugu News