venkaiah naidu: కేంద్రానికి ఏపీ ప్ర‌త్యేకమ‌ని ఎప్పటినుంచో చెబుతున్నాము.. మరోసారి రుజువైంది: వెంక‌య్య నాయుడు


కేంద్ర ప్ర‌భుత్వానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకమని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు అన్నారు. ఈ రోజు పార్ల‌మెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... కేవ‌లం మాట‌ల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నామ‌ని అన్నారు. ఈ రోజు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ రైతులకు మేలు క‌లిగించేలా ఉంద‌ని చెప్పారు. రాజ‌ధాని రైతుల‌కు మేలు క‌లిగేలా ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌న్న అంశాన్ని సానుకూలంగా ప‌రిశీలించిన‌ అరుణ్‌జైట్లీ... బ‌డ్జెట్‌లో ఆ విష‌యాన్ని ఉంచార‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై కేంద్రప్ర‌భుత్వానికి ప్ర‌త్యేకదృష్టి ఉంద‌ని మ‌రోసారి రుజువ‌యిందని ఆయ‌న అన్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో అమ‌రావ‌తి మెట్రోకు రూ.100 కోట్ల కేటాయింపులు కూడా వ‌చ్చాయ‌ని చెప్పారు. పీఐబీ అనుమ‌తి వ‌చ్చాక నిధులు పెరిగే అవ‌కాశం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News