army: స్వీట్లు పంచుకున్న భారత్-పాకిస్థాన్‌ సైనికులు


భార‌త్ 68వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు జ‌రుపుకుంటున్న నేప‌థ్యంలో పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఈ రోజు
ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఆ రాష్ట్రంలోని వాఘా వద్ద ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకొని ఇరు దేశాల మ‌ధ్య శాంతియుత వాతావ‌ర‌ణం ఉండాల‌ని కోరుకున్నారు. స్వాతంత్ర్య , గణతంత్ర దినోత్సవాల లాంటి ప్రత్యేక సందర్భాల్లో భార‌త్‌-పాకిస్థాన్ సైనికులు స్వీట్లు పంచుకోవ‌డం ఆన‌వాయతీగా వ‌స్తోంది. మ‌రోవైపు భార‌త్-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోనూ ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు.

  • Loading...

More Telugu News