special status: శాంతియుత వాతావర‌ణానికి భంగం క‌లిగించ‌వ‌ద్దు: డీజీపీ సాంబ‌శివ‌రావు


విశాఖ‌ప‌ట్నంలో యువ‌త ఈ రోజు నిర్వ‌హించాల‌నుకున్న ఆందోళ‌న‌కు ఎటువంటి అనుమ‌తులు లేవని డీజీపీ సాంబ‌శివ‌రావు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...  విశాఖ‌ప‌ట్నంలో ఉన్న ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని చెడ‌గొట్ట‌కూడ‌ద‌నే త‌మ‌ ప్ర‌య‌త్నమ‌ని అన్నారు. ప్ర‌త్యేక హోదా ఆందోళ‌న‌ను విశాఖ బీచ్‌లోనే చేయాల్సిన అవ‌స‌రం లేదని చెప్పారు. హోదా కోసం వేరే ప్ర‌దేశాల్లో ఆందోళ‌న తెలప‌వ‌చ్చు క‌దా? అని ప్ర‌శ్నించారు.

అనుమ‌తి లేద‌ని చెప్పినా కూడా ఆందోళ‌న‌కు రావాలంటూ ప‌లువురు సోష‌ల్ మీడియాలో ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారని ఆయ‌న అన్నారు. గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ఏటా చేసిన‌ట్లే భద్ర‌త ఏర్పాటు చేశామ‌న్నారు. గ‌ణ‌తంత్ర వేడుకల దృష్ట్యా ఇక్క‌డ‌కి రావ‌ద్ద‌ని తాము ముందుగానే ప్ర‌క‌టించామ‌ని చెప్పారు. విశాఖ‌ప‌ట్నంలో ఉన్న‌ శాంతియుత వాతావర‌ణానికి భంగం క‌లిగించ‌వ‌ద్దని సూచించారు.

  • Loading...

More Telugu News