kohli: ధోనీ ఇచ్చిన ఆ గిఫ్ట్ ని మధుర జ్ఞాపకంగా ఉంచుకుంటాను: విరాట్ కోహ్లీ


భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య‌ కటక్‌ వేదికగా గత గురువారం రెండో వన్డే జరిగిన విష‌యం తెలిసిందే. ఆ వ‌న్డేలో టీమిండియా విజ‌యం సాధించ‌డంతో టీమిండియా సిరీస్‌ను కూడా కైవ‌సం చేసుకుంది. అయితే ఆ మ్యాచ్‌ ముగియగానే కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్‌, టీమిండియా స్టార్ ఆట‌గాడు మ‌హేంద్ర సింగ్ ధోనీ ఓ గిఫ్ట్ ఇచ్చాడ‌ట‌. దీని గురించి కోహ్లీ బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ, తాను కెప్టెన్‌గా మొద‌టి సిరీస్ ను గెలుచుకున్న సంద‌ర్భంగా ఓ బంతిని ధోనీ తనకు ఇచ్చాడని తెలిపాడు. ఆ వన్డే మ్యాచ్‌ గెలవగానే తన వద్దకు వచ్చిన ధోనీ ఆ మ్యాచ్‌ లో ఆడిన బాల్‌ను గుర్తుగా ఇచ్చాడ‌ని, ఆ బంతిపై తాను ధోనీ సంతకాన్ని తీసుకున్నాన‌ని తెలిపాడు. దాన్ని ఒక మధుర జ్ఞాపకంగా దాచుకుంటానని అన్నాడు.

  • Loading...

More Telugu News