venkaiah: రాజకీయ లబ్ధికోసం జల్లికట్టును వాడుకుంటున్నారు: వెంక‌య్య ఆగ్ర‌హం


త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న జ‌ల్లిక‌ట్టు ర‌చ్చ‌పై కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు ఘాటుగా స్పందించారు. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు వారి రాజకీయ లబ్ధికోసం జల్లికట్టును వాడుకుంటున్నాయని ఆయ‌న అన్నారు. ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు సంయ‌మ‌నంతో ఉండాల‌ని ఆయన సూచించారు. ఆ విష‌యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌ తీసుకువచ్చినప్పటికీ జ‌ల్లిక‌ట్టుపై వివాదం సృష్టిస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌ల్లిక‌ట్టుపై 2009లోనే మద్రాస్‌ హైకోర్టు నిషేధం విధించింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. అనంత‌రం కాంగ్రెస్‌ హయాంలో జ‌ల్లిక‌ట్టుకి ఆంక్షలతో కూడిన అనుమతులు వ‌చ్చాయ‌ని అన్నారు. ఆ రాష్ట్రంలో చెల‌రేగుతున్న‌ జల్లికట్టు వివాదానికి డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలదే బాధ్యత అని అన్నారు. ప్ర‌జ‌లు జ‌ల్లికట్టుపై ఆందోళ‌న‌లను విర‌మించాల‌ని ఆయ‌న కోరారు.

  • Loading...

More Telugu News