accident: ఉత్తరప్రదేశ్ లో ట్రక్కును ఢీకొన్న పాఠశాల బస్సు.. 10 మంది చిన్నారుల మృతి


ఓ పాఠ‌శాల బ‌స్సు ట్ర‌క్కును ఢీ కొన‌డంతో ప‌దిమంది చిన్నారులు అక్క‌డిక్క‌డే మృతి చెందిన ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లాలోని అలీగంజ్‌లో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మరో 40 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న రెస్క్యూ టీమ్ గాయాల‌పాల‌యిన వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రుల‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

  • Loading...

More Telugu News