ap dgp: కోడి పందేలపై మూడు రోజుల్లో 1,347 కేసులు న‌మోదు: ఏపీ డీజీపీ


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి సంద‌ర్భంగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కోడిపందేలు నిర్వ‌హించిన వారిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు డీజీపీ సాంబ‌శివ‌రావు తెలిపారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... విజ‌య‌వాడ‌లో 91, ప‌శ్చిమ‌ గోదావ‌రిలో 337, తూర్పు గోదావ‌రిలో 136, కృష్ణా జిల్లాలో471, గుంటూరు గ్రామీణంలో 309, కేసులు ప‌మోదు న‌మోద‌య్యాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో కొంద‌రు ఫ్లెక్సీల ధ్వంసానికి పాల్ప‌డుతున్నార‌ని, దీనిని దృష్టిలో పెట్టుకుని విగ్రహాలు-ఫ్లెక్సీల నియంత్రణపై కొత్త నిబంధనలు తీసుకొస్తామ‌ని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో అటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారికి సంబంధించి ప‌లు ఆధారాలు ల‌భించాయ‌ని, వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News