resign: ఎన్డీటీవీ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ బర్కా దత్‌ రాజీనామా


ప్ర‌ముఖ న్యూస్ ఛానెల్ ఎన్డీటీవీ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ బర్కా దత్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. త్వ‌ర‌లోనే ఆమె సొంతంగా వెంచర్‌ ప్రారంభిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆమె రాజీనామాపై స్పందించిన ఎన్డీటీవీ త‌మ ఛానెల్‌లో ఆమె ఎంతో కాలం పనిచేశారని, ఆమె భవిష్యత్‌ బాగుండాలని పేర్కొంది.

కాగా, ఎన్‌డీటీవీలో ఆమె 1995లో చేరారు. ఇన్ని ఏళ్లు ఆమె ఎంతో నిబద్ధతతో పనిచేశారని ఎన్డీటీవీ పేర్కొంది. త‌మ కంపెనీ అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారని కొనియాడింది. ఆమె 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం విశేషాల‌పై స‌మ‌గ్రంగా కవరేజీ ఇచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఆమెకు కేంద్ర స‌ర్కారు పద్మశ్రీ అవార్డు కూడా ప్ర‌దానం చేసింది. మ‌రోవైపు రాడియా టేప్స్ వ్యవహారంలో బ‌ర్కా ద‌త్ ప‌లు విమర్శలు, ఆరోపణలను ఎదుర్కున్నారు.

ఇటీవ‌లే మ‌రో ఎడిట‌ర్‌ ఆర్నబ్‌ గోస్వామి కూడా త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న‌ సొంతంగా వార్తా చానల్ పెడతారని వార్త‌లు వ‌చ్చాయి.

  • Loading...

More Telugu News