Bipin Rawat: సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తే చర్యలు: ఆర్మీ చీఫ్‌ హెచ్చరిక


ఆర్మీ డే సంద‌ర్భంగా జ‌వాన్ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆర్మీ చీఫ్ బిపిన్‌రావత్ ఈ సందర్భంగా జ‌వాన్లు సోష‌ల్ మీడియాలో వీడియోలు పెడుతున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఇటీవ‌లే ముగ్గురు జ‌వాన్లు ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు త‌మ సమ‌స్య‌ల‌ను వివ‌రిస్తూ, త‌మ పై అధికారుల‌పై ఫిర్యాదులు చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, సమస్యలను సరైన మార్గంలో అధికారుల దృష్టికి తీసుకురాకుండా అటువంటి వీడియోలు పోస్టులు చేసిన సైనికులపై చర్యలు తీసుకుంటామని బిపిన్‌రావత్‌ హెచ్చరించారు. జ‌వాన్లు ఫిర్యాదు బాక్సుల్లో ఫిర్యాదు చేయాల‌ని, లేదంటే త‌న‌కు నేరుగా ఫిర్యాదు చేయాల‌ని ఇప్ప‌టికే బిపిన్ రావ‌త్ తెలిపారు.

  • Loading...

More Telugu News