accident: గొలుసు దొంగలను పట్టుకునేందుకు వెళుతుండ‌గా యాక్సిడెంట్‌.. ఎస్ఐ మృతి


క‌డ‌ప జిల్లాలోని సీసీఎస్‌ సెంట్రల్‌ క్రైం పోలీస్‌ స‍్టేషన్‌ ఎస్ఐ నాగన‍్న ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గొలుసు దొంగత‌నాల‌కు పాల్ప‌డుతున్న వారిని ప‌ట్టుకునేందుకు నడుచుకుంటూ వెళుతున‍్న ఆయ‌న‌ను ఓ ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్ట‌డంతో ఆయ‌నకు తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు వెంట‌నే ఆయ‌న‌ను రిమ్స్ ఆసుప‌త్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత‍్స పొందుతూ ఆయ‌న మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. విధి నిర్వ‌హ‌ణలోనే ప్రాణాలు కోల్పోయిన స‌ద‌రు ఎస్ఐకు భార‍్య, ముగ్గురు పిల‍్లలు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News