supreme court: చైనా మాంజాపై నిషేధం ఎత్తివేసేది లేదు: సుప్రీంకోర్టు


భార‌త్‌లో చైనా మాంజాల‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ (ఎన్జీటీ) ఇటీవ‌లే ఇచ్చిన‌ మధ్యంతర ఉత్తర్వులను స‌వాలు చేస్తూ గుజరాత్‌ కు చెందిన వ్యాపారస్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప‌తంగులు ఎగురవేసేందుకు ఆ మాంజాను ఉప‌యోగించడంలో అనుమతి ఇవ్వాల‌ని కోరారు. అయితే దీనిపై స్పందించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. చైనా మాంజాపై నిషేధం ఎత్తివేసేందుకు ఒప్పుకోలేదు. ఎన్జీటీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది.

కొన్ని రోజుల క్రితం చైనా మాంజాను నిషేధిస్తున్న‌ట్లు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసిన ఎన్జీటీ ఆ మాంజా ద్వారా జంతువులు, పక్షులకే కాక మ‌నుషుల‌కు కూడా హాని జ‌రుగుతుంద‌ని తెలిపిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News