attack: మద్యం మత్తులో రామచంద్రాపురం పోలీసుల వీరంగం


మ‌ద్యంతాగి అరాచ‌కాలు సృష్టిస్తోన్న వారిని అడ్డుకోవాల్సిన పోలీసులే మద్యం మత్తులో ఊగుతూ వీరంగం సృష్టించిన ఘ‌ట‌న సంగారెడ్డిలోని రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. ప్ర‌జ‌ల‌కి రక్షణగా నిలవాల్సిన ఖాకీలే రెచ్చిపోయి అకార‌ణంగా దాడికి దిగారు. రామచంద్రాపురం ఏఎస్ఐ బేత‌ప్ప‌, మరో కానిస్టేబుల్  కలిసి ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్‌తో పాటు ఓ క్లీన‌ర్‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌పై స‌ద‌రు డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ ఈ రోజు ఉద‌యం అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News