tirupati: శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌తో వెళ్లిన భక్తుడు.. గుర్తించని సిబ్బంది


తిరుమల తిరుప‌తి వేంక‌టేశ్వ‌రుడి ఆలయంలోకి ఓ భక్తుడు సెల్‌ఫోన్‌తో వెళ్లినప్ప‌టికీ భ‌ద్ర‌తా సిబ్బంది గ‌మ‌నించ‌లేక‌పోయారు. క్షుణ్ణంగా త‌నిఖీలు నిర్వ‌హించిన త‌రువాతే భ‌క్తుల‌ను ఆల‌యంలోకి పంపించాల్సిన సిబ్బంది మ‌రోసారి నిర్ల‌క్ష్యం క‌న‌బ‌ర్చారు. శ్రీవారిని దర్శించుకున్న ఓ భ‌క్తుడు తిరిగి బయటకు వచ్చే సమయంలో అతడి వ‌ద్ద సెల్‌ఫోన్ ఉంద‌ని గుర్తించిన సిబ్బంది అప్పుడు ఆ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి వెళ్ల‌కూడ‌ద‌నే నిబంధ‌న త‌నకు తెలియదని స‌ద‌రు భక్తుడు చెబుతూ.. దాన్ని సిబ్బంది స్వాధీనం చేసుకోవడం పట్ల ఆవేదన వక్తం చేశాడు.

  • Loading...

More Telugu News