kejriwal: ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు చేదు అనుభవం


హర్యానా రాష్ట్రంలోని రోహ్ తక్ జిల్లాలో ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహస్తున్న ర్యాలీలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభ‌వం ఎదుర‌యింది. ర్యాలీలో ఆయ‌న‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరాడు. ఈ ర్యాలీలో ప్ర‌సంగిస్తున్న కేజ్రీవాల్ మాట్లాడుతూ... కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆయ‌న‌పై దుండగుడు షూ విసిరాడు. దీంతో ర్యాలీకి కాసేపు ఆటంకం ఏర్ప‌డింది. ఆ దుండ‌గుడు వెంట‌నే అక్క‌డి నుంచి పారిపోయాడు.

  • Loading...

More Telugu News