samajvadi party: స‌మాజ్‌వాదీ పార్టీలో మ‌రో ట్విస్ట్‌... రాంగోపాల్ యాద‌వ్‌ను మ‌ళ్లీ స‌స్పెండ్ చేసిన ములాయం


సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. బ‌హిష్క‌ర‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఈ రోజు ల‌క్నోలో జరిగిన పార్టీ జాతీయస్థాయి సమావేశంలో అఖిలేష్‌ యాదవ్‌ పార్టీ అధ్యక్షుడి హోదాలో ప్ర‌సంగం చేసి త‌న తండ్రి ములాయం సింగ్ యాద‌వ్‌కు మ‌రింత కోపం తెప్పించారు. దీంతో రాంగోపాల్ యాద‌వ్‌ను ములాయం సింగ్ మ‌రోసారి స‌స్పెండ్ చేశారు. ఈ నెల 5న ములాయం సింగ్‌ జాతీయ‌స్థాయి స‌మావేశానికి పిలుపునిచ్చారు. మ‌రోవైపు కొద్దిసేప‌టి క్రితం ల‌క్నోలోని ములాయం సింగ్ యాద‌వ్ ఇంటికి శివ‌పాల్ యాద‌వ్ చేరుకున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య కీల‌క చర్చ‌లు కొన‌సాగుతున్నాయి. 

  • Loading...

More Telugu News