jeevan reddy: వేముల‌వాడ‌లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఇంత‌వ‌ర‌కు ఇవ్వలేదు: ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి


తెలంగాణ శాస‌న‌స‌భ‌లో భూసేక‌ర‌ణ అంశంపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు నిర్వాసితుల‌కు ఎవ్వ‌రూ ఇవ్వ‌నంత ప‌రిహారం ఇస్తామ‌ని కేసీఆర్ మాట్లాడుతున్నార‌ని, మ‌రోవైపు మిడ్ మానేరు నిర్వాసితుల‌కు ఇప్ప‌టివ‌ర‌కు ప‌రిహారం అంద‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వేముల‌వాడ‌లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్, ఇంత‌వ‌ర‌కు ఒక్క ఇల్లు కూడా క‌ట్టివ్వ‌లేద‌ని అన్నారు. నిర్వాసితుల‌కి కేసీఆర్ స‌రైన‌ ప‌రిహారం ఇస్తే  తాము అడ్డుప‌డ‌బోమ‌ని అన్నారు. నిర్వాసితుల‌కు ఇచ్చే న‌ష్ట‌ప‌రిహారం వారికి న‌ష్టం క‌లిగించే విధంగా ఉండ‌కూడ‌ద‌ని అన్నారు. ఇప్ప‌టి రిజిస్ట్రేష‌న్ విలువ‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని ప‌రిహారం చెల్లించాల‌ని ఆయ‌న‌ సూచించారు. రాష్ట్ర స‌ర్కారు మంచి ప‌రిహారం ఇస్తానంటే తాము వ‌ద్ద‌న‌బోమ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News