terror atteck: మణిపూర్ లోని లోక్‌చావోలో ఉగ్ర‌దాడి.. ఇద్ద‌రు జ‌వాన్ల మృతి.. హై అల‌ర్ట్‌


మణిపూర్‌ రాష్ట్రంలోని లోక్‌చావోలో ఈ రోజు ఉద‌యం ఉగ్ర‌వాదులు అల‌జ‌డి రేపారు. ఆ రాష్ట్ర  సీఎం ఓక్రాం ఇబోబి సింగ్‌ కార్యక్రమానికి భద్రత నిమిత్తం భద్రతా సిబ్బంది మోరహ్‌ నుంచి తెంగనౌపల్‌ జిల్లాకు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు ఒక్క‌సారిగా జ‌వాన్ల‌పై దాడికి దిగి ఇద్దరి ప్రాణాలు తీశారు. ఈ దాడిలో మరో నలుగురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఉగ్ర‌వాదులు పేలుడు ప‌దార్థాలు, తుపాకులతో ఈ దాడికి దిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో గాయాల‌పాల‌యిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో అప్ర‌మ‌త్త‌మ‌యిన భ‌ద్ర‌తాబ‌ల‌గాలు లోక్‌చావోలో హైఅలర్ట్‌ను ప్రకటించారు.

  • Loading...

More Telugu News