pm: బ్యాంకు ఎదుట క్యూలో మోదీ, మన్మోహన్ సింగ్, అద్వానీ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో


పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌జ‌లంద‌రూ బ్యాంకుల ముందు క్యూ క‌డుతూ క‌నిపిస్తున్నారు క‌దా! మ‌రి ఈ క‌ష్టాలు సామాన్యుల‌కేనా? దేశంలోని పెద్ద నాయ‌కులు, ప్ర‌జ‌లు ఎంత‌గానో గౌర‌వించే నాయ‌కులు బ్యాంకుల ముందు క్యూ క‌డితే ఎలా ఉంటుంది. ఇటువంటి ఆలోచ‌నే చేశారు నెటిజన్లు. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ప్ర‌జ‌లు ప‌డుతున్న అవ‌స్థ‌ల‌పై ఎన్నో ఫొటోలు, కార్టూన్లు సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వాటిల్లో ఓ ఫొటో నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. అందులో ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ బ్యాంకు ముందు నిల‌బ‌డ్డారు. ఆయ‌న వెనుకే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆ త‌రువాత బీజేపీ సీనియ‌ర్ నేత‌ ఎల్‌కే అద్వానీ ఉన్నారు. ముగ్గురు క‌ళ్ల‌జోడు పెట్టుకొని తాము సాధార‌ణంగా ప్ర‌జ‌ల‌కు కనిపించే గెట‌ప్‌లోనే బ్యాంకు క్యూ ముందు నిల‌బ‌డ్డారు. మోదీ  ఈ క‌ల్పిత ఫొటోలో సీరియ‌స్‌గా క‌నిపిస్తుండ‌గా, మిగ‌తా వారు డ‌బ్బుల కోసం క్యూ క‌ట్టి క‌ష్ట‌పడిపోయిన‌ట్లు క‌నిపిస్తున్నారు. ఈ నేత‌లు బ్యాంకు ముందు క్యూ క‌ట్ట‌డంపై నెటిజ‌న్లు ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు వారు జోకులు వేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News