Royal Challengers Bangalore: పంజాబ్ కింగ్స్ తో పోరు... టాస్ గెలిచిన ఆర్సీబీ

- ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్
- ఛండీగఢ్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు టీమ్
ఇవాళ ఆదివారం కావడంతో ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ ఛండీగఢ్ లో జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 70 పరుగులు చేసింది.
ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్ సిమ్రన్ సింగ్ 33 పరుగులు చేశారు. వీరిద్దరినీ కృనాల్ పాండ్యా పెవిలియన్ కు తిప్పి పంపాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు చేసి రొమారియో షెపర్డ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ప్రస్తుతం నేహల్ వధేరా (1 బ్యాటింగ్), జోష్ ఇంగ్లిస్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.