KCR: కేసీఆర్ పై సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష

  • నిందితుడు భువనగిరి జిల్లా వాసి
  • ఆధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టిన సీసీఎస్ పోలీసులు
  • విచారణ జరిపిన నాంపల్లి కోర్టు

సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై కొన్నాళ్ల క్రితం ఆకుతోట రామకృష్ణ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పాతబస్తీకి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదును మాదన్నపేట పోలీసులు సిసీఎస్ విభాగానికి బదిలీ చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడు భువనగిరి జిల్లాకు చెందినవాడిగా గుర్తించి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ పై వ్యాఖ్యలు చేసినట్టు పక్కా ఆధారాలు సంపాదించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.2,000 జరిమానా విధించింది.

KCR
  • Loading...

More Telugu News