jagan: ఢిల్లీ బయల్దేరిన జగన్... కేసీఆర్ పర్యటన రద్దు

  • నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న జగన్
  • కాళేశ్వరం పనుల్లో బిజీగా ఉన్న కేసీఆర్
  • మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

ముఖ్యమంత్రి హోదాలో ఏపీ సీఎం జగన్ తొలిసారి ఢిల్లీ బయల్దేరారు. విజయవాడ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు అందరికీ ఆహ్వానాలు అందాయి. జగన్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మరోవైపు, ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో వాటి పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ కారణంగా నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ లేదా ఫైనాన్స్ సెక్రటరీ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News