BJP: రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ తీర్థయాత్రలకు వెళ్లారు: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ మండిపాటు

  • రాష్ట్రంలో విద్యావ్యవస్థలు దెబ్బతిన్నాయి
  • 1000 గ్రామాలకు బస్సు సౌకర్యంలేదు
  • ఇలాంటి పరిస్థితుల్లోనే హాజీపూర్ ఘటనలు జరుగుతున్నాయి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుండడం పట్ల రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్ మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రం తీవ్ర సమస్యలతో అల్లాడుతుంటే కేసీఆర్ తీర్థయాత్రలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు, విద్యా విధానం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొందని, టీచర్, లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ కావడంలేదని అన్నారు. అక్షరాస్యత పరంగా రాష్ట్రం ఎక్కడో నిలిచిందని పేర్కొన్నారు.

మరోవైపు, గ్రామీణ ప్రాంతాలు రవాణా సౌకర్యంలేక అవస్థలపాలవుతుంటే ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 1000 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదన్న సంగతి వెల్లడైందని, ఇలాంటి పరిస్థితుల కారణంగానే హాజీపూర్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో సీఎం రాష్ట్రంలో లేకుండా తీర్థయాత్రలకు వెళ్లడం సరైనదేనా? అంటూ నిలదీశారు.

  • Loading...

More Telugu News