Chandrababu: చంద్రబాబు, కేసీఆర్ లు కీలకంగా వ్యవహరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు: జగ్గారెడ్డి

  • కేంద్రంలో వచ్చేది యూపీఏ ప్రభుత్వమే
  • ఉత్తమ్ తన పదవి నుంచి తప్పుకుంటే పీసీసీలో మార్పు
  • ఆ పదవిలో కొనసాగేందుకు బలమైన నేతలు ఉన్నారు

కేంద్రంలో వచ్చేది యూపీఏ ప్రభుత్వమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఈ రోజు ఆయన ముచ్చటిస్తూ, యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు, కేసీఆర్ లు కీలకంగా వ్యవహరించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

టీ-పీసీసీ మార్పు గురించి జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలకు, దీనికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవి నుంచి తప్పుకుంటే తప్ప పీసీసీలో మార్పు ఉండదని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ తప్పుకుంటే రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నం ప్రభాకర్ లాంటి బలమైన నేతలు ఆ పదవిలో కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

  • Loading...

More Telugu News