Chandrababu: జగన్ లోటస్ పాండ్ లో కేసీఆర్ ఇచ్చే కుక్క బిస్కెట్లు తింటున్నాడు: గురజాలలో చంద్రబాబు ఫైర్

  • కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నాడు
  • కోడికత్తికి వణుకుపుడుతోంది
  • యువత దెబ్బకు కోడికత్తి గిలగిల్లాడుతోంది

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం చివరిరోజున గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రోడ్ షో నిర్వహించారు. గురజాల వద్ద భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆనాడు స్వాతంత్ర్యపోరాటంలో మనవాళ్లలో కొందరు బ్రిటీష్ వాళ్లకు ఊడిగం చేశారని, ఇప్పుడు జగన్ కూడా లోటస్ పాండ్ లో ఉంటూ కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నాడని మండిపడ్డారు. "కేసీఆర్ ఇచ్చే కుక్క బిస్కెట్లు తింటున్నాడు. కేసీఆర్ ఇచ్చే పాపిష్టి డబ్బులనే వైసీపీ వాళ్లు ఇక్కడ ఇస్తున్నారు. వాళ్లిచ్చేదేంటి!... ఐదేళ్లలో ఐదుసార్లు నేనే ఇస్తాను నా చెల్లెమ్మలకు! తెలుగు తమ్ముళ్ల జోరుకు ఎక్కడ చూసినా కోడికత్తి గిలగిల్లాడిపోతోంది. మనవాళ్ల జోరు చూసి కోడికత్తికి వణుకుపుడుతోంది. ఏదో అనుకున్నాడు కానీ జనాల్లో ఈ స్పందన ఉంటుందని కోడికత్తి ఊహించలేకపోయాడు" అంటూ ఆవేశపూరిత ప్రసంగం చేశారు.

  • Loading...

More Telugu News