Chandrababu: నువ్వు 'బాహుబలి' అయితే నేను 'మహా బాహుబలి'!: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

  • నువ్వు 16 గెలిస్తే నేను 25 గెలుస్తా
  • తెలంగాణలో అన్ని పార్టీలను చంపేశావు!
  • రాజాం రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కేసీఆర్, జగన్, మోదీ ముగ్గురూ కలిసి ఏపీపై దాడికి వస్తున్నారని, వాళ్లందరికీ గట్టిగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత తెలుగు ఓటర్లపై ఉందన్నారు. ఓటు వేయనివాళ్లకు రాష్ట్రంపై ప్రేమ లేనట్టుగా భావించాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణ అంతా ఏకమైనప్పుడు మనకేం తక్కువైందని చంద్రబాబు పిలుపునిచ్చారు.

"తెలంగాణలో అన్ని పార్టీలను చంపేసిన కేసీఆర్ తాను 16 సీట్లు గెలుస్తానని అంటున్నాడు. నువ్వు 16 గెలిస్తే మేం 25 గెలిచి చూపిస్తాం. నువ్వు బాహుబలి అయితే నేను మహా బాహుబలి అవుతా! నువ్వు మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం! ప్రపంచంలో ఆంధ్రులు ఎక్కడున్నా రక్షణ ఇస్తా. జన్మభూమికి ద్రోహం చేస్తే మాత్రం వారిని వదులుకునేందుకైనా సిద్ధం. నేను పిరికిపందను కాను. మా జోలికి వస్తే మాత్రం అడ్రస్ గల్లంతు చేస్తాం!" అంటూ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఇక్కడ రాజాంలో చేసే నినాదాలు హైదరాబాద్ లో ఉండే కేసీఆర్ కు, ఢిల్లీలో ఉండే మోదీకి వినపడాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News