Chandrababu: గాంధీని చంపిన గాడ్సే కంటే నీతిమాలిన వ్యక్తి చంద్రబాబు: మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు

  • చంద్రబాబు పదో గ్రహం
  • కేసీఆర్ తంతే ఆంధ్రా పారిపోయాడు
  • నిప్పులు చెరిగిన మాజీ మంత్రి

ఒకప్పుడు తెలంగాణ టీడీపీలో కీలకనేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీటీడీపీ నుంచి తప్పుకున్న ఇతర నేతల్లాగానే మోత్కుపల్లి కూడా తరచుగా చంద్రబాబునాయుడ్ని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. దళితుడ్నయిన తాను ఎన్టీఆర్ హయాంలో మంత్రినయ్యానని, కానీ చంద్రబాబులాంటి దుర్మార్గుడు ఎన్టీఆర్ అల్లుడిగా వచ్చి వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. గ్రహాలు తొమ్మిదే అయినా పదో గ్రహంగా చంద్రబాబు పేరు చెప్పుకోవాలని, నక్కజిత్తులవాడు అని పేర్కొన్నారు.

ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తంతే పారిపోయిన పిరికిపంద చంద్రబాబు అని విమర్శించారు. నువ్వు నీతిమంతుడివే అయితే 29 కేసుల్లో ఎందుకు స్టే తెచ్చుకున్నావు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోయిందని, ఏపీలో కూడా చంద్రబాబును ఓడించి శని వదిలించుకోవాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు వల్ల ఏపీకి ప్రత్యేక హోదా రాదని, కేసీఆర్ లేఖ రాస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని మోత్కుపల్లి తెలిపారు. 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు తాను అందరికీ పెద్దకొడుకునని చెప్పుకుంటున్నాడని, సరిగ్గా చెప్పాలంటే చంద్రబాబు పెద్దకొడుకు కాదు పెద్ద తాత అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సభల్లో ప్రసంగాలు వింటున్నవాళ్లకు చెవుల నుంచి రక్తాలు కారుతున్నాయంటూ మోత్కుపల్లి వ్యంగ్యం ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News