Telugudesam: మోహన్ బాబుతో ఫీజు డ్రామా ఆడించింది కేసీఆరే: దివ్యవాణి

  • అలీని కూడా కేసీఆర్ బెదిరించారా?
  • ఏపీపై కేసీఆర్ జులుం ఏంటి?
  • దివ్యవాణి ఫైర్

ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన సినీ నటి దివ్యవాణి స్టార్ క్యాంపెయినర్ హోదాలో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పై మండిపడ్డారు. తిరుపతిలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ అంటూ మోహన్ బాబుతో డ్రామా ఆడించింది కేసీఆరేనంటూ ఆరోపించారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు లాగేసుకుంటామంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కమెడియన్ అలీని కూడా అలాగే బెదిరించారేమోనని సందేహాలు వస్తున్నాయని అన్నారు. ఎందుకంటే, ప్రాణస్నేహితుడైన పవన్ కల్యాణ్ ను కూడా కాదనుకుని అలీ వైసీపీలో చేరడం వెనుక ఏం జరిగిందన్నది పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అలీ ఆస్తులు లాగేసుకుంటామని కేసీఆర్ బెదిరించారా? అంటూ దివ్యవాణి ప్రశ్నించారు. అయినా, ఏపీపై కేసీఆర్ జులుం ఏంటని ఆమె నిలదీశారు.

ఇక, వైసీపీ నేతలపైనా దివ్యవాణి విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో రంగంలోకి దిగిన షర్మిల తన అన్న జగన్ పై ఉన్న కేసుల మాఫీ కోసమే రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని చెబుతున్న షర్మిల రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూడాలని, ఒక్కసారి అమరావతిలో ఏం జరుగుతుందో చూస్తే షర్మిల కూడా టీడీపీకే ఓటేస్తారని వ్యాఖ్యానించారు. ఫ్యాన్ కు ఉరేసుకుంటే ఒక్క ప్రాణమే పోతుందని, ఫ్యాన్ కు ఓటేస్తే అందరి ప్రాణాలు పోతాయని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News