Andhra Pradesh: డేటా చోరీ వివాదం.. తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టనున్న టీడీపీ?

  • తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఏపీ టీడీపీ నేతల ఆగ్రహం
  • డేటాను టీ-సర్కార్ చోరీ చేసిందని కేసు పెట్టే యోచన
  • పరువు నష్టం దావా కూడా వేస్తుందని సమాచారం

డేటా చోరీ కేసు వివాదంలో కీలక మలుపు చోటుచేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టే యోచనలో ఏపీ టీడీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసు పెట్టే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డేటాను తెలంగాణ సర్కార్ చోరీ చేసిందని కేసు పెట్టాలని, పరువు నష్టం దావా వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News