Telangana: తెలంగాణలో 70 మంది అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం

  • ఢిల్లీలో ముగిసిన ‘కాంగ్రెస్’ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
  • ఈ జాబితాను రేపు హైదరాబాద్ లో విడుదల చేస్తాం
  • ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు

తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకుంది. 70 మంది అభ్యర్థుల జాబితాకు అధిష్ఠానం ఆమోదం లభించింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో చర్చల అనంతరం ఈ జాబితాకు ఆమోదం పడింది. ఈ భేటీ అనంతరం, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు మాట్లాడుతూ, 70 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను రేపు హైదరాబాద్ లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News