chaitu: మళ్లీ తెరపైకి చైతూ, సమంతల జోడీ .. దర్శకుడిగా శివ నిర్వాణ

  • 'నిన్నుకోరి' దర్శకుడితో నిర్మాతగా కోన వెంకట్ 
  • కథానాయకుడిగా నాగచైతన్య 
  • ఆయన జోడీగా సమంత ఎంపిక 
  • తీరనున్న అభిమానుల ముచ్చట 

నాగచైతన్య .. సమంత కలిసి 'ఏమాయ చేశావే' .. 'ఆటో నగర్ సూర్య' సినిమాలు చేశారు. ఈ రెండింటిలో 'ఏ మాయ చేశావే' ఘన విజయాన్ని సాధించింది. ఈ మధ్యనే ఈ జంట వివాహం చేసుకుని అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. చైతూతో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తోన్న మారుతి, హీరోయిన్ పాత్రను సమంతతో చేయించాలని గట్టి ప్రయత్నమే చేశాడు గానీ కుదరలేదు.

 త్వరలోనే ఈ జంట మళ్లీ తెరపై కనిపించనుందనేది అభిమానులకు శుభవార్తలాంటిదే. రచయిత కోన వెంకట్ ఓ నిర్మాతగా మారి డీవీవీ దానయ్యతో కలిసి 'నిన్నుకోరి' సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ చిత్రాల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణతోను, డీవీవీ దానయ్యతోను కలిసి మరో సినిమాను నిర్మించడానికి కోన వెంకట్ రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూను కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నారు. కథ .. పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో చేయడానికి సమంత కూడా అంగీకరించిందని అంటున్నారు. ప్రస్తుతం చైతూ చేస్తోన్న రెండు సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.   

  • Loading...

More Telugu News