Telangana: విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మంత్రి కేటీఆర్

  •  ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొననున్న కేటీఆర్
  •  దక్షిణ కొరియా, జపాన్ లోనూ పర్యటన
  • టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చించనున్న మంత్రి

ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనే నిమిత్తం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు విదేశీ పర్యటనకు బయలు దేరి వెళ్లారు. ఈ నెల 23 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా దక్షిణ కొరియా, జపాన్, స్విట్టర్లాండ్ లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 15 నుంచి 22 వరకు దక్షిణ కొరియా, జపాన్ ను ఆయన సందర్శించి, అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చిస్తారని, ఎంఎన్ సీ ల నుంచి పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా పారిశ్రామిక పార్కులను కేటీఆర్ సందర్శించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News