ర‌ఘువీరారెడ్డి: ఇందిర‌మ్మ ఆశ‌యాల‌కు రాహుల్ గాంధీ వార‌సుడు: ర‌ఘువీరారెడ్డి

  • ఇందిర‌మ్మ భూస్వాముల‌తో పోరాడారు
  • పేద‌ల‌కు భూమిని పంపిణీ చేశారు
  • బ్యాంకుల‌ను జాతీయం చేశారు
  • న‌వంబ‌రు 19న ఇందిరా గాంధీ జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుతాం

ఇందిర‌మ్మ ఆశ‌యాల‌కు రాహుల్ గాంధీ వార‌సుడని ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ర‌ఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... ఇందిర‌మ్మ భూస్వాముల‌తో పోరాడార‌ని, పేద‌ల‌కు భూమిని పంపిణీ చేశార‌ని చెప్పారు. బ్యాంకుల‌ను జాతీయం చేసి పేద‌లు, బ‌ల‌హీన వ‌ర్గాలు బ్యాంకుల‌కు వెళ్లే అవ‌కాశం క‌ల్పించార‌ని తెలిపారు. గ‌రీభీ హ‌ఠావో అని పిలుపునిచ్చార‌ని, 20 సూత్రాల ప‌థ‌కాన్ని రూపొందించి ఎన్నో మంచి ప‌నులు చేశార‌ని పేర్కొన్నారు.

త‌మ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమాల‌ను వారి హ‌క్కుగా మార్చేసింద‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం కృషి చేసిందని, బ‌ల‌హీన వ‌ర్గాలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటార‌ని వ్యాఖ్యానించారు. న‌వంబ‌రు 19న ఇందిరా గాంధీ జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుతామ‌ని చెప్పారు.  

  • Loading...

More Telugu News