Rahul Gandhi: వాహ‌నంపైకి ఎక్కేసి.. రాహుల్ గాంధీపై చేయి వేసేసి.. సెల్ఫీ తీసుకున్న యువ‌తి.. మీరూ చూడండి!

  • గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి
  • ప్ర‌చారంలో జోరుగా పాల్గొంటున్న రాహుల్ గాంధీ
  • రాహుల్‌పై వీరాభిమానం చూపిన అమ్మాయి

గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. అధికార, విప‌క్ష పార్టీల నేత‌లు పోటాపోటీగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఆ ప్రాంతంలో జోరుగా ప్ర‌చారంలో పాల్గొంటూ బీజేపీ నేత‌ల‌పై పంచ్‌లు వేస్తూ త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ రోజు ఆ రాష్ట్రంలోని బ‌రూచ్‌లో రాహుల్ గాంధీ ప్ర‌చారానికి వెళ్లారు. ఆయ‌న వాహ‌నంపై ఉండగా ఓ యువ‌తి అంద‌రూ చూస్తుండ‌గానే వాహ‌నంపైకి ఎక్కేసింది. రాహుల్ గాంధీ కూడా ఏమీ అన‌లేదు. వాహ‌నంపైకి ఎక్కిన‌ ఆమె రాహుల్ గాంధీపై చేయి వేసి ఫొటో దిగాల‌ని చూసింది. ఆ త‌రువాత స్మార్ట్‌ఫోన్ తీసుకుని సెల్ఫీ దిగింది. అనంత‌రం రాహుల్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి దిగిపోయింది. మీరూ చూడండి...

  

  • Loading...

More Telugu News