cricket: టీ20లోనూ బోల్తా పడుతోన్న ఆస్ట్రేలియా

  • 18.4 ఓవ‌ర్ల‌కు 8 వికెట్ల న‌ష్టానికి 118 ప‌రుగులు
  • వర్షం కారణంగా మ్యాచ్ కి అంతరాయం
  • ఫించ్ 42 మినహా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయిన ఆసీస్ బ్యాట్స్ మెన్
  • బుమ్రా, కుల్దీప్ యాద‌వ్ కు రెండేసి వికెట్లు

వ‌న్డే సిరీస్ లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా ఈ రోజు ప్రారంభ‌మైన టీ20లోనూ అదే తీరును క‌న‌బ‌ర్చింది. 18.4 ఓవ‌ర్ల‌కు 8 వికెట్ల న‌ష్టానికి 118 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. అదే స‌మ‌యంలో జోరు వాన రావ‌డంతో మ్యాచ్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్న‌ర్ 8, ఫించ్ 42, మ్యాక్స్‌వెల్ 17, ట్రావిస్ హెడ్ 9, హెన్రిక్వెస్ 8, డానియెల్‌ క్రిస్టియ‌న్ 9 (ర‌నౌట్‌), డిమ్ పైనీ 17, కౌల్టెర్ నైల్ 1, ఆండ్రూ టై 0 (బ్యాటింగ్‌), జంపా  4 ప‌రుగులు తీశారు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 1, బుమ్రా 2, హార్దిక్ పాండ్యా 1, ఛాహల్ 1, కుల్దీప్ యాద‌వ్ 2 వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News