cricket: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ


ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌రికాసేప‌ట్లో ఇరు జ‌ట్ల మ‌ధ్య‌ తొలి వ‌న్డే ప్రారంభం కానుంది. వ‌న్డే జ‌ట్టుకి విరాట్ కోహ్లీ తొలిసారి సార‌థ్యం వ‌హిస్తున్నాడు. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జ‌ట్టులో పెద్దగా ప్రయోగాలు చేయబోమని విరాట్ కోహ్లీ నిన్న తెలిపిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ ఘోరంగా విఫ‌ల‌మ‌యింది. వ‌న్డేలోనూ అదే ఆట‌తీరు క‌న‌బ‌రిచి విజ‌యం సాధించాల‌ని టీమిండియా ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రోవైపు వ‌న్డే సిరీస్‌లో గెలిచి పోయిన ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని ఇంగ్లండ్ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది.

  • Loading...

More Telugu News